పాక్ మరో దుశ్చర్య

పాక్ మరో దుశ్చర్య

శ్రీనగర్ జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. ఎల్‌ఓసీ వెంబడి కాల్పులకు తెగబడి రక్తపాతం సృష్టించింది. ఈ కాల్పుల్లో భారత్‌కు చెందిన ఆరుగురు పౌరులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు జవాన్లు, నలుగురు పౌరులు ఉన్నారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరోవైపు కాల్పుల్లో పలు ఇళ్లు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితి నేపథ్యంలో భద్రతా దళాలు మరింత అప్రమత్తం అయ్యాయి. పాకిస్తాన్ చర్యపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos