గాంధీ మాట.. గాడ్సే చేత..ఇదే భాజపా బాట

గాంధీ మాట.. గాడ్సే చేత..ఇదే భాజపా బాట

ఔరంగా బాద్ : జాతిపిత బాపూపై భాజపా నేతలు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు ఎంపీ అసదు ద్దీన్ ఓవైసీ విమర్శించారు. గురువారం మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఔరంగాబాద్లో ప్రసంగించారు. ‘భాజపా నేతలు గాంధీ పట్ల కపట ప్రేమను చూపిస్తున్నారు. పెదవులపై గాంధీ నామ స్మరణ.. మనస్సులో ఉండేది గాడ్సే. గాంధీజీని హత్య చేసిన నాథురాం గాడ్సే అధికార పార్టీ హీరో. భాజపా తన దుకాణాన్ని గాంధీ పేరిట నిర్వహిస్తోంది. ఆయన పేరుతో యావత్ దేశాన్ని మోసం చేస్తోంది. మూడు తూటాలతో గాంధీని గాడ్సే హత్య  చేసాడు. వాళ్లు మాత్రం ప్రతి రోజూ హత్య చేస్తున్నారు. రైతుల గురించి గాంధీ ఆలోచించేవారు. కానీ ఇప్పుడా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంద’ని ధ్వజ మెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos