‘నాకున్నది ఒకే భార్య’

అమరావతి: దిశ ఘటన సమాజానికి తలవంపులని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం దిగువ సభలో మాట్లా డారు. ’26 ఏళ్ల దిశ టోల్ గేట్ వద్ద బైకు ఆపితే, ఆ బైకును పంక్చర్ చేసి, సాయం చేస్తున్నట్లు నటించి, అత్యాచా రం చేసి కాల్చేశారు’ అని అన్నారు. ‘ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఎలా స్పందించాలి? పోలీసులు ఎలా స్పందిం చాలి? రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి? అన్న విషయం నాక్కూడా తెలిసింది. నిజంగా చాలా బాధ అనిపించింది. ఇలాంటి ఘటన మన రాష్ట్రంలో జరిగితే ఎలా స్పందించాలి? అన్న ప్రశ్న తలెత్తింది. తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసిన తర్వాత దోషుల్ని కాల్చేసినా తప్పులేదు అధ్యక్షా. నాకు కూడా ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు, చెల్లి ఉంది. భార్య ఉంది.. నాకున్నది ఒక్క భార్యే అధ్యక్షా. వారికి ఏమైతే జరిగితే నేను ఏ విధంగా స్పందిస్తాను అధ్యక్షా?’ అని జగన్ వ్యాఖ్యానించారు. మన ఇళ్లల్లోని వారికి ఇటువంటి దారుణం జరిగితే ఎంతో తల్లడిల్లిపోతా మని ఆక్రోశించారు. నేరస్థులకు కఠిన శిక్షలు ఉండాలన్నారు. ‘నాకున్న ది ఒక్క భార్యే అధ్యక్షా’ అని జగన్ వ్యాఖ్యానించినపుడు సభ్యులంతా నవ్వులు చిందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos