హైదరాబాద్ : వినియోగదారులకు కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు కొద్ది కొద్దిగా దిగి వస్తున్నాయి. నెల రోజుల కిందట క్వింటాల్ ఉల్లి ధర హోల్సేల్ మార్కెట్లో రూ.12 వేల నుంచి రూ.13 వేలు పలుకగా సోమవారం క్వింటాల్కు 8,500 నుంచి 9వేల రూపాయలకు దిగింది. హోల్సేల్ మార్కెట్లోనూ కిలో 90 రూపాయల నుంచి 100 రూపాయలు పలుకుతోంది. రెండు నెలల ధరలతో పోలిస్తే కిలోకు దాదాపు 50 నుంచి 100 రూపాయలు తగ్గినట్టేనని వ్యాపారులు చెబుతున్నారు. గత రెండు రోజుల నుంచి హోల్సేల్ మార్కెట్లకు దిగుమతులు బాగా పెరిగాయి. రోజుకు 80 నుంచి 100 లారీల వరకు వస్తున్నాయని మార్కెటింగ్శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి కూడా నగరానికి ఉల్లిదిగుమతి పెరిగింది. మరో వారం రోజుల్లో గుజరాత్ నుంచి ఉల్లిగడ్డ నగరానికి చేరే అవకాశం ఉందని తెలిపారు. ఈ లెక్కన మరో 15 రోజుల్లో ఉల్లి ధరలు సాధారరణ స్ధితికి వస్తాయని హోల్సేల్ ఉల్లి వ్యాపారులు వెల్లడించారు.