కొద్ది రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభానికి మంగళవారం తెర పడింది.బలపరీక్షలో ఓడిపోవడంతో కర్ణాటకలో 14 నెలల పాటు పాలన సాగించిన సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది.అదే సమయంలో 105 మంది ఎమ్మెల్యేలతో బలపరీక్షలో నెగ్గి బీజేపీ అధికారం చేజిక్కించుకుంది.దీంతో సహజంగానే బీజేపీపై విమర్శలు,ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీపై ట్విట్టర్ వేదికగా నిప్పులు కురిపించారు.తాను చేసిన తప్పులకు బీజేపీ పశ్చాత్తాపపడే రోజు తప్పకుండా వస్తుందని ఏదోఒక రోజు మాచేతికి దొరుకుతారంటూ ట్వీట్ చేశారు.డబ్బులు పెట్టి అన్నింటినీ కొనలేమని, అందర్నీ ఒత్తిడికి గురి చేయలేమనే నిజాన్ని బీజేపీ నాయకులు తెలుసుకునే రోజు ఎంతో దూరం లేదని చెప్పారు. బీజేపీ అసలు రంగు ఏమిటో ఆ రోజు దేశ ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. బీజేపీ చేస్తోన్న అంతులేని అవినీతి కార్యకలాపాలను ప్రజలు ఎంతో కాలం పాటు సహించలేరని చెప్పారు. ప్రజలను, ప్రజా హక్కులను పరిరక్షించడానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థల దుర్వినియోగాన్ని ప్రజలు గుర్తిస్తారని అన్నారు.అధికారాన్ని అందుకోవడానికి బీజేపీ అడ్డదారులు తొక్కిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.ఆపరేషన్ కమలను ఆరంభించి కర్ణాటకలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చి వేసిందని, ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్లలపై దృష్టి సారించిందని ఆరోపిస్తున్నారు బీజేపీ ప్రత్యర్థి పార్టీల నేతలు..
One day the BJP will discover that everything cannot be bought, everyone cannot be bullied and every lie is eventually exposed.
1/2
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 23, 2019