ఏనుగు దాడిలో వృద్ధురాలి మృతి

హొసూరు : ఏనుగు దాడిలో ఓ వృద్ధ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. గుడిసాకనపల్లికి చెందిన  వెంకటలక్ష్మి శనివారం ఉదయం తన మనమరాలు దివ్యతో కలసి గ్రామ సమీపంలోని బహిర్భూమికి వెళ్ళింది. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న ఓ ఏనుగు వెంకటలక్ష్మిపై అకస్మాత్తుగా దాడి చేసింది. ఆమె అక్కడికక్కడే మరణించగా, దివ్య ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటనపై హొసూరు అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు.  వెంకటలక్ష్మి మృతహాన్ని స్వాధీనపరచుకొని హొసూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  అటవీ శాఖ అధికారి మురుగేశన్ మృతురాలి కుటుంబానికి మొదటి విడతగా రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అవసరమైన పత్రాలను సమర్పించి మిగిలిన మూడున్నర లక్షల నగదును తీసుకోవాలని ఆయన మృతురాలి కుటుంబానికి సూచించారు. ఇదిలా ఉండగా హొసూరు ప్రాంతంలో విచ్ఛలవిడిగా తిరుగుతూ, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్న ఏనుగులను దట్టమైన అటవీ ప్రాంతానికి తరిమేయాలని అటవీ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos