ముంబై : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చేసిన వ్యాఖ్యల్ని శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ ఖండించారు. ‘విదేశీ నేత ఒకరు భారత దేశ నేతలపై అలాంటి అభిప్రాయాల్ని వెల్లడించడం సరికాదు.భారత దేశం గురించి తెలుసో చెప్పాలి. ఒబామా వ్యాఖ్యలపై దేశంలోని నేతల మాటలు చాలా అసహ్యకరంగా ఉన్నాయ’ని దుయ్యబట్టారు. ‘రాహుల్లో నిరాసక్తతే కనిపిస్తుంది.. టీచర్ మెప్పు కోసం ఎదురు చూసే విద్యార్థిలా ఉంటుంది ఆయన మనస్తత్వం. విషయాన్ని లోతుగా నేర్చు కోవాలనే తపన, ఆసక్తి ఆయనలో ఉం డవ’ని ఒబామా తన పుస్తకం ‘ఏ ప్రామిస్డ్ లాండ్’లో రాహుల్ గాంధీ పట్ల అభిప్రాయపడ్డారు. 17న విడుదల కానున్న ఈ పుస్తకాన్ని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక సమీక్షించింది.