కొట్టాయం: కేరళ నన్పై అత్యాచారం కేసులో బిషప్ ప్రాంకో ములక్కల్ను కొట్టాయం అదనపు సెషన్స్ కోర్టు శుక్ర వారం నిర్దోషిగా ప్రకటించింది. 2018 ఒక నన్ పై అత్యాచారం చేశాడని బిషప్ ప్రాంకో ములక్కల్ పై కేసు నమోదైంది. కోర్టు తీర్పు వెలువడన తర్వాత ములక్కల్ కోర్టు నుంచి బయటకు వచ్చి ‘‘ప్రభువును స్తుతించండి’’ అని కోరారు. నన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో క్యాథలిక్ బిషప్ ఫ్రాంకో ములక్కల్ అరెస్టు అయ్యారు. 2014 మే5 వతేదీన బిషప్ కురవిలంగాడ్ కాన్వెంట్ని సందర్శించినపుడు రాత్రి తనను గదిలోకి పిలిచి అసహజ సంభోగం కోసం బలవంతం చేశారని నన్ ఫిర్యాదులో పేర్కొంది. 2014 నుంచి 2016 మధ్య కాలంలో బిషప్ తనపై 13 సార్లు అత్యాచారం చేశాడని నన్ ఆరోపించింది.