రామ్చరణ్,తారక్ల కాంబినేషన్లో దర్శకుడు రాజమౌళి అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం వల్ల అందరికంటే ఎక్కువగా లండన్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్కు పాపులారిటీ దక్కుతోంది.అప్పటి వరకు ఏవో వెబ్సిరీస్లో ఒకటీ రెండు చిత్రాల్లో నటించిన డైజీ ఆర్ఆర్ఆర్లో నటించనున్నట్లు ప్రకటించగానే డైజీ పేరు మారుమోగుతోంది.తారక్,ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు తెలుగు ప్రేక్షకులు,హిందీ ప్రేక్షకులు డైజీ గురించి గూగుల్లో వెతకడం ప్రారంభించారు. అప్పటివరకు ఎవరికీ తెలియని డైజీ ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ప్రకటన వెలువడ్డాక తెగ పాపులర్ అయింది.అప్టపి వరకు ఐదువేల మందిగా ఉన్న డైజీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆర్ఆర్ఆర్ ప్రకటన అనంతరం ఫాలోవర్స్ సంఖ్య అమాంతం 20వేలకు పెరిగింది.అందులో చాలా శాంత ఎన్టీఆర్ అభిమానులు ఉండడం విశేషం.డైజీ ఏదైనా కొత్త ఫోటో లేదా పోస్ట్ చేసినా లైకులపై లైకులు,కమెంట్లు పెడుతున్నారు.మరికొంత అభిమానులు వెల్కమ్ టు టాలీవుడ్,జై ఎన్టీఆర్,యంగ్ టైగర్తో నటించడం మీ అదృష్టం,మీరు త్వరగా రావాలి లేదంటే షూటింగ్ లేటవుతుందంటూ కమెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఆర్ఆర్ఆర్పై ఏదైనా అప్డేట్ ఇవ్వండంటూ డైజీకి పోస్ట్ చేస్తున్నారు.అయితే అభిమానులు ఎన్ని కమెంట్లు,పోస్ట్లు చేస్తున్నా డైజీ మాత్రం రిప్లై ఇవ్వకపోవడంతో అభిమానుల్లో కొంత అసహనం వ్యక్తమవుతోంది.ఆర్ఆర్ఆర్ చిత్రంపై డైజీకి ఆసక్తి లేదేమోనని అసలు ఆర్ఆర్ఆర్ గురించి,చిత్రంలో తన పేరును ప్రకటించడం గురించి డైజీకి తెలియదేమోనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు..