లాభాల్లో ముగిసిన మార్కెట్లు

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమ వారం లాభాల్ని గడించాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు ఇందుకు కారణం. సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 52,880కి, నిఫ్టీ 112 పాయింట్లు పెరిగి 15,834కి ఎగబాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.16%), టాటా స్టీల్ (2.07%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.38%), ఎల్ అండీ టీ (1.35%), యాక్సిస్ బ్యాంక్ (1.26%) లాభాల్ని గడించాయి. టెక్ మహీంద్రా (-1.51%), డాక్టర్ రెడ్డీస్ (-0.63%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.50%), టైటాన్ కంపెనీ (-0.20%), భారతి ఎయిర్ టెల్ (-0.10%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos