న్యూ ఢిల్లీ : త్వరలో కొత్త రూ.20 నోట్లు విడుదల కానుంది. మహాత్మా గాంధీ శ్రేణిలో ఈ నోట్లు ఆకు పచ్చ, పసుపు కలగలిసిన వన్నెలో ఉంటాయని భారతీయరిజర్వ్ బ్యాంకు శనివారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపింది. నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ అశోక స్తూపం చిత్రాలు, వాటి పక్క దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంటుంది. నోటు వెనుక ఎల్లోరా గుహలు, స్వచ్ఛ భారత్ లాంఛనం, నినాదాలు ఉంటాయి.