కొద్ది రోజుల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడి పదవికి రాహుల్గాంధీ రాజీనామా చేయడంతో ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు.దీంతో ఏఐసీసీ అధ్యక్ష పదవికి సమర్థుడైన నాయకుడి కోసం కాంగ్రెస్ అధిష్టానం ఎదురు చూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 134 ఏళ్ల చరిత్ర గల పార్టీకి అధ్యక్షుడు లేని పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమనని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే సత్తా కేవలం గాంధీ కుటుంబానికి మాత్రమే ఉందని కాంగ్రెస్ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి తొలగాలంటే ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ సూచించారు.సోన్ భద్రలో కాల్పుల బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లి ఆమె చూపిన చొరవను ఆయన ప్రశంసించారు. పార్టీని నడిపించగలిగే సామర్థ్యం ఆమెకు ఉందనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఈ విషయంలో ప్రియాంక అద్భుతంగా వ్యవహరించారన్న నట్వర్ సింగ్.. ఆమె ఏం కోరుకున్నారో అది సాధించుకున్నారని అన్నారు. అలా కాకుండా గాంధీయేతరులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే 24 గంటల్లో కాంగ్రెస్ నిలువునా చీలిపోవడం తథ్యమని వ్యాఖ్యలు చేశారు.అలా కాకుండా రాహుల్గాంధీ వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ పగ్గాలు గాంధీయేతరలకు అప్పగిస్తే 24 గంటల్లో కాంగ్రెస్ పార్టీ నిలువుగా చీలిపోవడం తథ్యమన్నారు..