హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తమదే అయినందున, అందులోని పదవులూ తమకే సొంతమని హోం శాఖ మాజీ మంత్రి నాయిని నర్సిం హారెడ్డి ఆశించారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘తాజాగా మాధ్యమాల్లో వచ్చిన వార్తల గురించి కేటీఆర్ అడిగారు. నేను ఏదో చిన్నగా చెబితే కొండంతగా రాశార’ని చెప్పానన్నారు. తాజాగా మంత్రి వర్గ విస్తరణ అనంతరం ఆర్టీసీ అధ్యక్ష పదవిలో రసం లేదని నాయని వ్యాఖ్యా నించారు. ఇప్పుడు మాట మార్చారు. అదే ఆర్టీసీ అధ్యక్ష పదవి పదవి ఇచ్చి రసాన్ని కూడా వాళ్లే పోస్తారని వ్యాఖ్యానించారు. తనని ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్లి మాట్లాడతానని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.