ఉత్తర కొరియా కవ్వింపు చర్య

ఉత్తర కొరియా కవ్వింపు చర్య

పాంగ్వంగ్: కరోనా వైరస్ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న వేళ ఉత్తర కొరియా మాత్రం ఖండాంతర క్షిపణులను ప్రయోగించింది. వోన్సాన్ పట్టణం నుంచి సీ ఆఫ్ జపాన్ పై క్షిపణులను ప్రయోగించింది. సూపర్ లార్జ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్లను కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. జపాన్, కొరియా, రష్యాల సరిహద్దులో ఉన్న ద్వీపం లక్ష్యంగా ఆదివారం ఈ రాకెట్ల ప్రయోగం జరిగిందని సమాచారం. క్షిపణి ప్రయోగాల్ని ప్రత్యక్షంగా తిలకించే దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ సారి రాలేదని స్థానిక మాధ్యమ సంస్థలు ల్లడించాయి. ఆయనకు బదులుగా, అధికార పార్టీ ఉపాధ్యక్షుడు రీ ప్యాంగ్ చోల్ ప్రయోగాలను పర్యవేక్షించారని పేర్కొంది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలపై దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మండిపడ్డారు. కరోనాపై ప్రపంచమంతా పోరాడుతున్న వేళ, ఉత్తర కొరియా ఇలా ప్రవర్తించడం అనుచితమని ఆగ్రహించారు. రెండు బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించిందని ఆరోపించారు. క్షిపణి ప్రయోగాలను అమెరికా ఇంటలెజిన్స్ వర్గాలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నాయని, వీటి గురించి తమ అధ్యక్షుడు ట్రంప్ కు కూడా తెలుసునని అమెరికా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. జపాన్ ప్రత్యేక ఎకనామిక్ జోన్ కు అతి దగ్గరలోనే క్షిపణులు పడినట్లు గుర్తించామన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos