నా కాలు పడితేనే భారత్ లో కరోనా అంతం

నా కాలు పడితేనే భారత్ లో కరోనా అంతం

న్యూ ఢిల్లీ:‘ ఛూ.. మంతర్.. నా కాలు పడితేనే భారత్ లో కరోనా అంతం. భారతదేశంలో కరోనా అంతం చేయగలిగింది నేనొక్కడినే’ అని స్వామి నిత్యానంద ప్రగల్భాలాడారు. దేశంలో తాను అడుగుపెట్టగానే కరోనా అంతమవుతుందని వ్యాఖ్యానించారు. “లైంగిక వేధింపులు, రాసలీలలతో వార్తల్లోకి ఎక్కిన నిత్యానంద.. ఆ తరువాత కేసుల్లో ఇరుక్కుని 2019లో దేశం వదిలి పారిపోయారు. ‘కైలాస’ అని ఓ ప్రత్యేక ద్వీప దేశాన్ని ఏర్పాటు చేసుకుని తన అనుచరులతో అక్కడే ఉంటున్నాడు. “ఈ స్వయంప్రకటిత దేవుడు ఇప్పుడు తాజాగా కరోనాకు తానే పరిష్కారం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన విడుదల చేసిన ఓ వీడియోలో భారతదేశంలో కరోనా అంతం చేయగలిగింది తానొక్కడినే అని చెప్పుకొచ్చారు. దేశంలో తాను అడుగుపెట్టగానే కరోనా అంతమవుతుందంటూ నిత్యానంద వ్యాఖ్యానించారు. భారత్ నుంచి ఏ భక్తుడికీ తన కైలాస దేశానికి అనుమతి లేదన్నాడు. నిత్యానంద విడుదల చేసిన వీడియోలు మీమ్ మేకర్స్ కు పండగలా మారతాయి. కరోనాతో భయాందోళనల్లో ఉన్న ప్రజలకు ఇవి కాసేపు ఆటవిడుపుగా పనిచేస్తాయి

తాజా సమాచారం