నితీశ్‌ను హత్య చేయాలన్న వ్యక్తి అరెస్ట్

నితీశ్‌ను హత్య చేయాలన్న వ్యక్తి అరెస్ట్

పాట్న: బిహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ను హత్య చేసిన వారికి రూ. 25లక్షల నగదు బహుమతి ఇస్తానని సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన ఓ వ్యక్తిని పంజాబ్ పోలీసులు మంగళవారం లూథియానాలో అరెస్ట్ చేశారు. బిహార్ రోహ్తాస్ జిల్లాలోని తోడా గ్రామానికి చెందిన ధర్మేంద్ర కుమార్ పాండే అనే వ్యక్తి ముఖ్యమంత్రి నితీష్కుమార్ను హత్యచేసిన వారికి రూ.25 లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ ఓ వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోస్టు చేసిన వీడియో, మొబైల్ నంబర్ అధారంగా నిందితుణ్ని వెంటాడి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.‘ నిందితున్ని అదుపులోకి తీసుకున్న లూథియానా పోలీసులు అతడి స్థితి సరిగా లేదనే సందేశాన్ని పంపించార’ని రోహ్తాస్ పోలీసు సూపరింటెండెంట్ సత్యవీర్ సింగ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos