ఎన్‌ఐఏ బృందంపై దాడి.. ఇద్దరు అధికారులకు గాయాలు..!

ఎన్‌ఐఏ బృందంపై దాడి.. ఇద్దరు అధికారులకు గాయాలు..!

న్యూ ఢిల్లీ : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ బృందంపై దాడి జరిగింది. మేదినీపూర్ జిల్లాలోని భూపతినగర్ లో 2022లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ బృందం ఇవాళ దాడులు చేసేందుకు అక్కడికి చేరు కుంది. అయితే, భూపతినగర్ వాసులు ఎన్ఐఏ బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్ఐఏ అధికారులను చుట్టు ముట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జనం అధికారుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులు గాయపడినట్లు తెలిసింది. వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. భూపతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్యబిలా గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి ఇంటి వద్ద డిసెంబర్ 2022లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎన్ఐఏ అధికా రులు 2023 జూన్లో దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఇవాళ భూపతి నగర్కు వెళ్లారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos