నీట మునిగి నేపాలీ మృతి

నీట మునిగి నేపాలీ మృతి

హోసూరు : ఇక్కడికి సమీపంలో నీటి కుంటలో మునిగి నేపాల్ దేశస్థుడు మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. భోబు(25) హోసూరు సమీపంలోని సానసంద్రం గ్రామంలో నివసిస్తూ హోసూరు పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి సానసంద్రం సమీపంలోని కుంటలో స్నానానికి వెళ్ళాడు. కుంట మధ్యకు వెళ్లి ఈత కొడుతుండగా అకస్మాత్తుగా మూర్ఛ వచ్చింది. అపస్మారక స్థితికి వెళ్లిపోయి నీటిలో మునిగిపోయాడు. భోబు నీటిలో మునిగి పోవడం స్నేహితులు చూసినా,  అతనిని కాపాడలేకపోయారు. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారమందడంతో హోసూరు అగ్నిమాపక సిబ్బందిని రప్పించి శవాన్ని వెలికి తీసి హోసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos