చంద్ర బాబు ‘చాణక్య’ శపథం

చంద్ర బాబు ‘చాణక్య’ శపథం

అమరావతి: మాజీ ముఖ్యమంత్రిచ, తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం శాసన సభలో సంచలన ప్రకటన చేశారు. ‘మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతా . అంతవరకు సభలో అడుగుపెట్టబోన’ని శపథం చేసారు. ‘నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ఏ పరువు కోసమైతే తాపత్రయపడ్డానో దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తు న్నారు. చివరకు నా భార్య ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. సభలో ఎన్నో చర్చలను చూశా కానీ ఇంత దారుణంగా సభ జరగడాన్ని ఎప్పుడూ చూడలేద’న్నారు.‘కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ముఖం చూడాలనుందని సీఎం జగన్ అన్నప్పటికీ నేను పట్టించుకోలేదు. నా కుటుంబసభ్యులను రోడ్డుపైకి లాగు తున్నారు. ఈ సభలో నేను ఉండలేను. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతాన’ని సభలోని అందరికీ నమస్కారం చేసి బయటకు వెళ్లిపోయారు. ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి బయటకు వచ్చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos