ఎవరూ ఊహించని విధంగా నాగచైతన్య,రష్మిక మందన్న జోడీగా చిత్రం తెరకెక్కనున్నట్లు వెలువడ్డ వార్తలు తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. హిందీలో సూపర్ హిట్ సాధించిన ‘బదాయి హో’ రీమేక్లో యాక్ట్ చేయడానికి నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. నాగ చైతన్య, దిల్ రాజు కాంబోలో రూపొందనున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోందని, ఆ సినిమా పేరు ”అదే నువ్వు అదే నేను” అని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమిని అఫీషియల్గా ట్విట్టర్లో ప్రకటించింది. దర్శకనిర్మాతలకు బదులు ప్రసార హక్కులు దక్కించుకున్న ఓ ఎంటర్టైన్మెంట్ సంస్థ.. చిత్రం పేరు హీరో హీరోయిన్ల వివరాలు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది.
నాగ చైతన్య, రష్మిక మండన్న నటించిన అధే నువ్వు అధే నేను యొక్క ఉపగ్రహ హక్కులను జెమిని టివి సొంతం చేసుకుంది. #GeminiTV@chay_akkineni @iamRashmika pic.twitter.com/250nleEzk7
— Gemini TV (@GeminiTV) September 12, 2019