స్పందించని వెధవలకు విమర్శించే హక్కు లేదు..

మెగా బ్రదర్‌,జనసేన పార్టీ నేత నాగబాబు రాజకీయ ప్రత్యర్థులపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ బోర్డు,ప్రభుత్వం నిర్లక్షంతో 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డా నోరు మెదపని వెధవలకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై విమర్శలు చేసే నైతిక హక్కు లేదంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన ఏకైక నేత పవన్‌కళ్యాణ్‌ మాత్రమేనని విద్యార్థులకు జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పార్టీ జనసేన పార్టీయేనన్నారు.ప్రతీరోజూ పవన్‌కళ్యాణ్‌పై అవాకులు చెవాకులు పేలే వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డి,సీనియర్‌ నేత విజయసాయిరెడ్డిలు ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు.లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం గురించి స్పందించడానికి వీలుపడే జగన్‌కు విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించడానికి వీలు కుదరడం లేదా అంటూ ప్రశ్నించారు.కేసీఆర్‌ అంటే వైసీపీ పార్టీ భయపడుతుందని జనసేన ఎవ్వరికీ భయపడదన్నారు.పవన్‌కళ్యాణ్‌ కానీ తాను కానీ కేసీఆర్‌ అంటే అసలు భయపడమని జగన్‌కు దమ్ముంటే ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు స్పందించాలంటూ సవాల్‌ విసిరారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos