మర్డర్ విడుదలకు అవరోధం

మర్డర్ విడుదలకు అవరోధం

హైదరాబాదు: రామ్గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమాకు విడుదలకు అవరోధం కలిగింది. రెండేళ్ల కిందట నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పెరుమాల్ల ప్రణయ్ అనే యువకుడి హత్య ఆధారంగా మర్డర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనిపై పలు అభ్యంతరాల్ని వ్యక్తం చేసి ప్రణయ్ భార్య అమృత నల్లగొండ జిల్లా న్యాయస్థానానికి ఫిర్యాదు చేసారు. తమ అనుమతి లేకుండా తమ ఫోటోలు, పేర్లు వాడుకుంటున్నారని తప్పుబట్టారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసు విచారణ పూర్తయ్యే వరకు సినిమా విడుదల నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos