అమరావతి: రాజధాని వివాదం కేసుల వాదనకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ నియామకాన్ని సవాల్ చేస్తూ మంగళవారం ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. రోహత్గీకి రూ.5 కోట్లు రుసుము చెల్లించనున్నారు. ప్రభుత్వం తరఫున రోహత్గిని నియమించడం న్యాయవాదుల చట్టానికి విరుద్ధమని అందులో పేర్కొన్నారు.