నాగర్కర్నూలు
; గగ్గలపల్లి కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి దొడ్ల వెంకట రెడ్డి సోమవారం నాగర్కర్నూలు
కలెక్టర్ను ఆశ్రయించి తెరాస తనకు ఇవ్వజూపిన రూ.పది లక్షలను వెంట తెచ్చారు. పోటీ నుంచి
తప్పుకోవాలంటూ ప్రత్యర్థి తనను బెదిరించారని ఫిర్యాదు చేశారు. తెరాస అభ్యర్థి ఈశ్వర
రెడ్డి తనను చంపుతానని బెదిరించాడని, అందుకనే పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వివరించారు.
ఇందుకు గాను తనకు రూ.పది లక్షలు కూడా ఇచ్చారని, ఆ డబ్బును డీఆర్వోకు చూపించారు. ఆదివారం
వెంకట రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఈశ్వర రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.