న్యూఢిల్లీ: అయోధ్యపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో తమకు ఆమోదయోగ్యం కాని విషయాలు కూడా ఉన్నాయని ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. మరొక్కసారి దృష్టిసారించాల్సిందిగా సుప్రీంకు విన్నవిస్తామని తెలిపింది. న్యాయపరంగా ఎలా అడుగువేయాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తమకు సంతృప్తికరంగా లేదన్నారు. కార్యవర్గ సమితి సమావేశంలో చర్చించాల్సిన విషయాలు ఉన్నాయని చెప్పారు. 15వ శతాబ్దానికి ముందు ఆధారాలు ఉన్నాయి అంటే.. 15వ శతాబ్దం తర్వాత కూడా ఆధారాలు ఉంటాయి కదా? అని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రశ్నించింది.