మర్కజ్ మౌలానా కోసం పోలీసుల గాలింపు

మర్కజ్ మౌలానా కోసం పోలీసుల గాలింపు

న్యూఢిల్లీ : తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కోసం రెండు క్రైం బ్రాంచ్ ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఇక్కడి నిజాముద్దీన్ లోని మర్కజ్ కరోనా కేంద్రంగా మారడానికి మౌలానా సాద్ కారణమని ఆయనకు వ్యతిరేకంగా పోలీసులు అంటు వ్యాధుల నివారణ చట్టం- -1897లోని సెక్షన్-3 కింద ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసారు. దీంతో తను పారిపోయారు. మౌలానా సాద్ గురువారం విడుదల చేసిన ఆడియో సందేశం ఐపీ అడ్రసు సాయంతో అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సాద్ నివాసాల్లో దాడులు చేసిన పోలీసులు అతని దగ్గరి బంధువులనూ ప్రశ్నిస్తున్నారు. తాను ఒంటరిగా ఉన్నానని సాద్ ఆ సందేశంలో చెప్పడంతో తనను గుర్తించేందుకు పోలీసులు మసీదులు, జమాత్ కార్యకర్తల ఇళ్లలోనూ గాలింపు చేపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos