వాషింగ్టన్:మొదటి సారిగా భారత్ రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మత విశ్వాసాలు, నూతన పౌరసత్వ చట్టం గురించి ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉందని శ్వేత భవనం సీనియర్ అధికారి ఒకరు విలేఖరులతకు తెలిపారు. చట్ట ప్రకారం అన్ని మతాలను సమా నంగా గౌరవించడం,మత విశ్వాసాలపై స్వేచ్ఛ వంటివి భారత రాజ్యంగంలోనే స్పష్టంగా ఉన్నాయని గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవ స్థలు, సంప్రదాయాలపట్ల అమెరికాకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు.