మో, షా పిడికిట్లో పార్టీ, సర్కారు విల విల

మో, షా పిడికిట్లో పార్టీ, సర్కారు విల విల

జైపూర్ : ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా భాజపాతో బాటు కేంద్ర ప్రభుత్వాన్ని తమ గుప్పెట్లో బంధించారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారం ఇక్కడ తీవ్రంగా విమర్వించారు. ‘కేంద్ర మంత్రి వర్గంలో ముగ్గురు, నలుగురు మంత్రుల గురించి తప్ప ఇతరులు ఎవరు ఉన్నారనేదీ ప్రజలకు అంతగా తెలియదు. ఎందుకంటే, భాజపాతో పాటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇతరులు ఏమీ చేయలేకపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నించే అర్హత భాజపా నేతలకు లేదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos