దేశం మో.షాల జాగీర్దారు కాదు

దేశం మో.షాల జాగీర్దారు కాదు

కోల్కతా:‘అవును, నేను పాకిస్తానీని. భాజపా ఏం చేసుకుంటుందో చేసుకోమనండి. ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు. రంగా, బిల్లాలు ఢిల్లీలో కూర్చుని ఏం చెప్పినా మేము ఆమోదించాలా? లేకుంటే మాపై దేశద్రోహులని ముద్ర వేస్తారా కాంగ్రెస్ పార్టీ అధినేత అధీర్ రంజన్ చౌదరి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు . ఉత్తర 24 పరగణా జిల్లా బషీర్హట్లో గురువారం జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘సీఏఏ, ఎన్నార్సీ అమలు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాం. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగుతాయి . భారతదేశం నరేంద్రే మోదీ, అమిత్ షా వ్యక్తిగత ఆస్తి కాదని దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్కు పూర్తిగా మతిస్థిమితం తప్పిందని వ్యాఖ్యానించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) భూభాగం భారత్ స్వాధీనంలోకి రావాలని పార్లమెంటు భావిస్తే ఆ దిశగా చర్యలు చేపడతామన్న ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే వ్యాఖ్యల్నీ తప్పుబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos