నిందితుల తరఫున వాదించబోం

నిందితుల తరఫున వాదించబోం

అహ్మదాబాద్: మోర్బీ వంతెన ప్రమాదంలో నిందితులకు న్యాయ సహాయాన్ని అందించకూడదని మోర్బీ బార్ అసోసియేషన్, రాజ్ కోఠ్ బార్ అసోషియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒరేవా సంస్థ చెందిన తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదంలో 135 మంది చనిపోయారు. నిందితుల్లో నలుగురు పోలీసు రిమాండ్లో ఉండగా, ఐదుగురిని జైలుకు పంపారు. ఈ తొమ్మిది మంది నిందితుల తరఫున వాదించబోరని మోర్బీ బార్ అసోసియేషన్, రాజ్ కోట్ బార్ అసోసియేషన్ తీర్మానాలను ఆమోదించినట్టు మోర్బీ న్యాయవాదుల సంఘం సీనియర్ అడ్వొకేట్ ఏ.సి. ప్రజాపతి తెలిపారు. వంతెన ప్రమాదంలో నిందితులకు న్యాయ సహాయాన్ని అందించకూడదనీ, ఈ రెండు న్యాయవాదుల సంస్థలు తీర్మానం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos