‘సాలు మోదీ.. సంపకు మోదీ’

‘సాలు మోదీ.. సంపకు మోదీ’

సికింద్రాబాద్ : హైదరాబాద్ జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఆయన రాకను ఆక్షేపించి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ‘సాలు మోదీ.. సంపకు మోదీ’ హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ‘బైబై మోదీ’ అనే హ్యాష్ ట్యాగ్ రాసారు. ‘రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవ్, నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమేనని యువత కడుపు కొట్టినవ్, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేసినవ్, హఠాత్తుగా లాక్ డౌన్ అని గరీబోల్లను చంపినవ్, నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖాతాల్లో వేస్తానన్న రూ. 15 లక్షలు ఏవి?, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేసినవ్ అంటూ ఫ్లెక్సీలపై రాశారు. ఈ ఫ్లెక్సీలను బీజేపీ నేతలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos