ధనం ప్రజలది. ఉచిత ప్రచారం మోదీకి

న్యూ ఢిల్లీ : యువతకు ఉచితంగా టీకాలు ఇస్తున్నందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ బ్యానర్లు కట్టాలని యూజీసీ కార్యదర్శి రజనీశ్ జైన్ వివిధ విశ్వవిద్యాలయాల అధికారులకు వాట్సప్ సందేశాలు పంపించారు. దీన్ని మూడు విశ్వవిద్యాలయాల అధికారులు ధ్రువీకరించారు. జైన్ మాత్రం స్పందించలేదు. విశ్వ విద్యాలయాల్లో 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు వేస్తున్నందున హిందీ, ఇంగ్లీష్ల్లో బ్యానర్లు కట్టాలని సూచించారు. సమాచార, ప్రసార శాఖ రూపొందించిన కొన్ని బ్యానర్ల నమూనాలను జత చేశారు. దిల్లీ , హైదరాబాద్ సెంట్రల్, భోపాల్లోని ఎల్ఎన్సీటీ , బెన్నెట్, గురుగ్రామ్లోని నార్త్క్యాప్ యూనివర్సిటీలు ఆ బ్యానర్లు కట్టాయి. ఈ చర్యను పలువురు విద్యావేత్తలు తప్పుబట్టారు. ‘ఉచిత వ్యాక్సిన్ ప్రజల హక్కు. దీన్ని ప్రజాధనంతోనే వేస్తున్నారు. టీకాలు వేయటంలో జాప్యం జరిగింది. ఈ వైఫల్యం నుంచి ప్రభుత్వం తప్పించుకోజాలదు.” అని దిల్లీ విశ్వవిద్యాలయం ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షురాలు అభా దేవ్ హబీబ్ వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos