మిథాలిరాజ్‌ కూడా చేరిపోయింది..

  • In Sports
  • March 31, 2020
  • 176 Views
మిథాలిరాజ్‌ కూడా చేరిపోయింది..

కరోనా వైరస్పై  దేశం చేస్తున్న యుద్ధానికి క్రీడాకారులంతా తమ వంతు సహకారం అందిస్తున్నారు. సెల్ఫ్ క్వారంటైన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే.. ఆర్థిక సహకారం అందిస్తూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. సచిన్ టెండూల్కర్(రూ.50లక్షలు),సురేశ్ రైనా, విరాట్ కోహ్లీఅనుష్క శర్మ దంపతులు, అజింక్యా రహానె(రూ10లక్షలు), రోహిత్ శర్మ(రూ.80లక్షలు) ఇప్పటికే తమకు తోచిన విరాళాలు ప్రకటించగా తాజాగా జాబితాలో భారత మహిళల వన్డే టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా చేరింది.కరోనాపై పోరాటానికి తన వంతుగా రూ. 10 లక్షల సాయం ప్రకటించి మంచి మనసు చాటుకుంది. మొత్తంలో ఐదు లక్షలు ప్రధాన మంత్రి అత్యవసర సహాయ నిధికి, మరో ఐదు లక్షల రూపాయలు తెలంగాణ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్టు ప్రకటించింది. ‘ప్రాణాంతక కరోనా మహమ్మారిపై పోరాటంలో మనమంతా చేతులు కలపాలి. నా వంతు చిన్న సాయంగా పీఎం కేర్స్ ఫండ్కు రూ. 5 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ. 5 లక్షలు ఇస్తున్నాఅని మిథాలీ ట్వీట్ చేసింది.పురుషులతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు జీతభత్యాలు, ప్రకటనల రూపంలో ఆదాయం తక్కువే అయినా మిథాలీ పెద్ద మొత్తంలో సాయం చేసింది. మహిళా క్రీడాకారుల్లో పీవీ సింధు, మిథాలీ రాజ్మాత్రమే రూ. 10 లక్షల సాయం ప్రకటించడం విశేషం. మరో మహిళా క్రికెటర్, టీ20 ప్రపంచకప్లో అద్భుతంగా రాణించిన పూనమ్ యాదవ్ రూ.2 లక్షల విరాళం ప్రకటించింది. భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ రూ.1.25లక్షలు అందించాడు.

 

తాజా సమాచారం