అమరావతి : నిర్ణీత ఆరు నెలల్లోగా ఉభయ సభల్లో, ఎందులోనూ సభ్యుడుగా ఎన్నిక కాకపోవడంతో మంత్రి కిడారి శ్రవణ్ పదవికి గురువారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సమర్పించడానికి ముందు శ్రవణ్ ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లి మంత్రి లోకేశ్తో చర్చించారు. అనంతరం సచివాలయానికి వెళ్లి సీఎం కార్యాలయం అధికారులకు రాజీనామా లేఖను అందజేశారు. గత నవంబరు 11న కిడారి శ్రవణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారంతో ఆరు నెలల గడువు ముగుస్తుంది. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన అరకు నుంచి పోటీ చేశారు. ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి.