కావాలంటే పార్టీని వీడండి

కావాలంటే పార్టీని వీడండి

న్యూ ఢిల్లీ:‘కావాలంటే పార్టీని వీడి వెళ్లొచ్చు’అని మిలింద్కు కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్ మండిపడ్డారు.కేజ్రీవాల్ చేసిన అభివృద్ధి కార్య క్రమాల్ని, సాధించిన విజయాలకు సంబంధించిన గణాంకాల్ని ట్విటర్లో పోస్ట్ చేయటమే దీనికి కారణం. ‘ ఢిల్లీ ప్రభుత్వ ఆదాయాన్ని రెండిం త లు చేయడంలో కేజ్రీవాల్ విజయం సాధించారు’. ఇప్పుడు దేశం లో ఆర్థికంగా దూసుకెళ్తున్న రాష్ట్రాల్లో దిల్లీ ఒకటి. ఆయన హయాంలో చేప ట్టిన కార్యక్రమాల్ని కేజ్రీవాల్ వివరిస్తున్న ఓ వీడి యోను కూడా మిలింద్ ట్విట్టర్ జత చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వంలో రాష్ట్ర ఆదా యం 14.87 శాతం పెరిగింది. అదే ఆప్ హయాంలో అది 9.90 శాతమే. అసత్య ప్రచారాలు మానండి. . కావాలంటే పార్టీ వీడి వెళ్లొ చ్చంటూ చురక’ లంటించారు. ‘నేను దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చేసిన అభివృద్ధిని ఎప్పటికీ తక్కువ చేయను. ఆప్తో పొత్తును సమ ర్థించడం కంటే షీలాజీ సాధించిన విజయాల్ని మీరు హైలైట్ చేసి ఉంటే నేడు కాంగ్రెస్ అధికారంలో ఉండేది’ అని మిలింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos