అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు ప్రధాని ప్రశంస

అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు ప్రధాని ప్రశంస

బృందావన్‌ : సమాజంలో ఆకలిని పారదోలడానికి అక్షయ పాత్ర ఫౌండేషన్‌ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన థర్డ్‌ బిలియన్త్‌ మీల్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 మంది పేద విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఆకలిని పారదోలడానికి వారు చేస్తున్న కృషి అమోఘమని అనంతరం ఆయన ట్వీట్‌ చేశారు. కాగా ఇస్కాన్‌ స్థాపించిన అక్షయ పాత్ర ఫౌండేషన్‌, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సహకారం అందిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos