హైదరాబాద్ : ఎవరిలో ఎలాంటి ప్రతిభ దాగి ఉందో ఎవరికి ఎరుక. అయితే సమయం వచ్చినప్పుడు ఆ ప్రతిభ దానికంతట అదే బయటపడుతుంది. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ఓ కార్మికుడి అద్భుతమైన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్ మెట్రో రైలు పనుల్లో భాగంగా భోజన విరామ సమయంలో ఓ కార్మికుడు సరదాగా డ్యాన్స్ చేశాడు. ఆ డ్యాన్సు అచ్చు ప్రసిద్ధ పాప్ గాయకుడు మైఖేల్ జాక్సన్ను అనుకరించినట్లుంది. ఈ వీడియోను హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇలాంటి ప్రతిభ కలిగిన కార్మికులను చూసి తాను గర్విస్తున్నానని పేర్కొన్నారు. సూపర్ టాలెంట్ అంటూ తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ప్రశంసించారు. పలువురు నెటిజన్ల నుంచి సైతం ఆ కార్మికునికి అభినందనలు శర పరంపరగా వచ్చి పడుతున్నాయి.
— MD HMRL (@md_hmrl) June 9, 2019