విజయవాడ:మంత్రివర్గ సమావేశ నిర్వహణకు శుక్రవారం మధ్యహ్నం మూడు గంటలకు నిర్వహించనున్న పరిశీలన సమావేశానికి హాజరు కావాలని అన్ని శాఖల అధికార్లను ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం బుధవారం ఆదేశించారు. కరవు, ఫొని తుపాను, ఉపాధి హామీ పథకం అమలు, మంచి నీటి సమస్యల గురించి నివేదికలు సమర్పించాలని కోరారు. ఎన్నికల మార్గదర్శక నియమావళికి అనుగుణంగా నివేదికలు ఉంటేనే మంత్రి వర్గ సమావేశ నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమ తిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో ఈ నెల 10న మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించదలచారు. చర్చనీయాంశాలకు ఎన్నికల సంఘం అనుమతి అనివార్యమైనందున తో మంత్రివర్గ సమావేశాన్ని 14కు వాయిదా వేశారు.