న్యూఢిల్లీ: ‘దిశ’ నిందితుల్ని ఎదురు కాల్పుల పేరిట పోలీసులు హతం చేయటం గురించి కథనాల ప్రచురణ, ప్రసారాల్లో, సామా జిక మాధ్యమాల్ని కట్టడి చేయాలని అత్యున్నత న్యాయస్థానం గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.తుది తీర్పు వచ్చేంత వరకూ మాధ్యమాలు సంయమనంతో ఉండాలని సూచించింది. ఎదురు కాల్పులపై ఇతర సంస్థలచే సాగుతున్న దర్యా ప్తుల్ని నిలుపుదల చేసింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు విచారణలు జరపొద్దని ఆదేశించింది. తాము ఏర్పా టు చేసిన విచారణ కమిషన్ సభ్యుల భద్రత, విచారణకు కార్యాలయం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. కమిషన్ సభ్యుల భద్రతను సీఆర్పీఎఫ్ కు అప్పగించింది.