తే నీరు పంచిన దీదీ

తే నీరు పంచిన దీదీ

న్యూ ఢిల్లీ: పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టీ వ్యాపారి అవతారాన్ని ఎత్తారు. డిఘా పట్టణంలోని ఒక టీ అంగట్లో టీ చేసి పలువురిని పలకరించారు. పర్యాటక అభివృద్ధికి గత 15 న డిఘా ప్రాంతంలో పర్యటించారు. డిఘాకు మరికొద్ది సేపట్లో చేరుకుంటామనగా వాహన శ్రేణిని ఆపమని చెప్పారు. అది ఆగిన వెంటనే కారు దిగి దగ్గరలో ఉన్న చిన్న కిరాణా కొట్టులోకి వెళ్లారు. ఓ చిన్నారిని ఎత్తుకొని ముద్దు చేసారు. కాసేపు ఆడించారు. అనంతరం అక్కడ టీ చేస్తున్న వ్యక్తిని తప్పించి తానే టీ చేశారు. అక్కడున్న వారికి స్వయంగా అందించారు. టీ తయారీ గురించి కిరాణ కొట్టు యజ మా నిని అడిగి తెలుసు కున్నారు. ‘‘కొన్నిసార్లు చిన్న చిన్న ఆనందాలు జీవితానికి ఎంతో సంతృప్తిని ఇస్తుంటాయి. టీ చేయడం, టీ ప్రియులకు స్వయంగా అందించడం మంచి జ్ఞాపకం’’ అని వీడియో షేర్ చేసిన ఆమె ట్విట్టర్లో రాసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos