ఎవ‌రితో పొత్తు లేదు.. ఒంట‌రిగానే పోరు

ఎవ‌రితో పొత్తు లేదు.. ఒంట‌రిగానే పోరు

లక్నో: బీఎస్పీ నేత మాయావతి క్లారిటీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరు చేయనున్నట్లు వెల్లడించారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదన్నారు. తమ పార్టీ స్వంతంగానే ఎన్నికల బరిలో దిగుతుందన్నారు. ఎన్నికల వేళ వస్తున్న ఊహాగానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె తమ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. తన ఎక్స్ అకౌంట్లో ఆమె దీనిపై ఓ పోస్టు చేశారు. తమ పార్టీపై కొందరు పొత్తు గురించి రూమర్లు చేస్తున్నారని, అంటే తమ ప్రమేయం లేకుండా ఎవరి గెలువరన్న విషయం స్పష్టం అవుతోందని ఆమె అన్నారు. ప్రజల ప్రయోజనం, సంక్షేమం కోసం రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానో పోటీ చేయనున్నట్లు మాయావతి తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos