ముంబై: నటి ఊర్మిళ మటోండ్కర్ (46) మంగళవారం ఇక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ,శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సమక్షంలో శివసేన కండువా కప్పుకున్నారు. థాకరే నివాసం మాతోశ్రీలో జరిగిన నిరాడంబర ఊర్మిళను సాదరంగా పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. థాకరే కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఊర్మిళ గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.