శ్రీకృష్ణ జన్మస్థలంలో మసీదు తొలగించాలి

శ్రీకృష్ణ జన్మస్థలంలో మసీదు తొలగించాలి

మథుర: ఇక్కడి శ్రీకృష్ణ జన్మస్థలంలో ఉన్న షాహీ ఈద్గా మసీదును తొలగించాలని రెండేళ్ల కిందట దాఖలైన వ్యాజ్యాన్ని జిల్లా కోర్టు గురువారం విచారణకు స్వీకరించింది. కృష్ణుడి భక్తు రాలు రంజనా అగ్నిహోత్రి దీన్ని దాఖలు చేశారు. ఇప్పుడు శ్రీ కృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు కేసు సీనియర్ డివిజన్ కోర్టులో నడుస్తుంది. మొత్తం కృష్ణ జన్మభూమి కాంప్లెక్స్ 13.37 ఎకరాల్లో విస్తరించి ఉంది. అదే ప్రాంగణంలో మసీదు నిర్మించారని పిటిషన్దారులు ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos