నాటింగ్హామ్ : ప్రపంచ కప్పులో ఈరోజు ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్కు వరుణ గండం తప్పేట్లు లేదు. సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు పడుతుండడంతో మైదానం చిత్తడిగా మారింది. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది. అయితే నాటింగ్హామ్లో గురువారమంతా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలపడంతో అసలు టాస్ అయినా వేస్తారా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఒక వేళ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. భారత్ ఇప్పటికే రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో ఉంది.