దూసుకుపోయిన మార్కెట్లు

దూసుకుపోయిన మార్కెట్లు

ముంబై:స్టాక్ మార్కెట్లు గురువారం దూసుకుపోయాయి. వ్యాపారం ప్రారంభమైన వెంటనే మార్కెట్లు ఒక్కసారిగా భారీ లాభాల్లోకి వెళ్లాయి. చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. ఫిబ్రవరి 14 తర్వాత మార్కెట్లు మళ్లీ ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా గెలవబోతున్నారనే అంచనాలతో మార్కెట్లు జోరు లో కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 724 పాయింట్లు లాభపడి 41,340 కి, నిఫ్టీ 212 పాయింట్లు పుంజుకుని 12,120కి చేరుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (5.63%), టాటా స్టీల్ (5.34%), బజాజ్ ఫైనాన్స్ (4.95%), బజాజ్ ఫిన్ స్ర్వ్ (4.15%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.46%) బాగా లాభాల్ని గడించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos