ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.49,169 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10 గంటలకు 383 పాయింట్లు, 14,816 వద్ద వ్యాపారాన్ని ఆరంభించిన నిఫ్టీ 106 పాయింట్లు లాభ పడ్డాయి. టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎమ్ అండ్ ఎమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్ లాభాలు పొందాయి. టాటా కన్సూమర్ ప్రోడక్ట్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఎయిచర్ మోటార్స్ నష్టపోయాయి.