ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్ర వారం లాభాలతో వ్యాపారాల్ని మొదలు పెట్టాయి. అమెరికా-ఇరాన్ సమరానికి విముఖత చూపటం ఇందుకు కారణమని విశ్లేషకుల మదింపు. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 77 పాయింట్లకు పైగా లాభపడి 4 1530 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 12237 వద్ద ఆగాయి. ఇన్ఫోసిస్, భారతీ ఇన్ఫ్రాటెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీ ఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్ లాభాల్ని గడించాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ నష్ట పోయాయి.