ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీయటంతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో వ్యాపారాల్ని ప్రారంభించాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 1,025 పాయింట్లు ఎగబాకి 31,627 వద్ద, నిఫ్టీ 291 పాయింట్లు లాభపడి 9,284 వద్ద ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.22 వద్ద దాఖలైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ట్రంప్ మార్గదర్శకాలు విడుదల చేయడంతో వివిధ దేశాల్లోనూ ఉద్దీపన, పునరుద్ధరణ ప్రణాళికల రూపకల్పన ఊపందుకుంది. టీసీఎస్,యాక్సిస్ బ్యాంక్,ఐసీఐసీఐ బ్యాంక్,హెచ్డీఎఫ్సీ,బజాజ్ ఫినాన్స్, హీరో మోటార్కార్ప్, జీ ఎంటర్టైన్మెంట్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ సుజుకీ ఇండియా షేర్లు లాభాల్ని పొందాయి. సన్ ఫార్మా, నెస్లే ఇండియా, హెచ్యూఎల్ స్వల్ప నష్ట పోయాయి.