బెంగళూరు: కర్ణాటకలోనూ జాతీయ పౌర పట్టికను అమలు చేయనున్నట్లు హోం మంత్రి బసవరాజబొమ్మై ఇక్కడ విలేఖరులకు తెలిపారు. రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల సమాచారాన్ని ప్రభుత్వం సమీకరిస్తోందని తెలిపారు. అది ముగిసిన తర్వాత కేంద్రం దృష్టికి తీసు కెళతామ న్నారు. అక్రమవలసదారులు అత్యధికంగా నివసిస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటన్నారు. ఢిల్లీ, బెంగాల్, కర్ణాటకలో జాతీయ పౌర జాబితాను అమలు చేయాలని ఆయా రాష్ట్రాల భాజపా నేతలు కేంద్రాన్ని కోరారు.