ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాం అంద‌రినీ క‌లుపుకుని పోరాడతాం

ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాం అంద‌రినీ క‌లుపుకుని పోరాడతాం

విశాఖ : ‘జనసేన పార్టీ ఎన్జీవో కాదు. ఇదో రాజకీయ పార్టీ. ఎన్నికలకు సిద్ధమవుతున్నాం’ అని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఒక దృశ్య మాధ్యమానికి ఇచ్చిన ఇంట ర్వ్యూలో స్పందించారు వివరించారు. ‘మా స్వార్థం గురించో, మా లబ్ధి గురించో పని చేయాలనుకోవడం లేదు. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం మంచి ఉద్దే శంతోనే పని చేస్తోంది. ఆ నమ్మకం మాకు ఉంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసినప్పుడు మూడు అంశాలపై మాట్లా డాము. అమరావతి, ఏపీలో పెట్టుబడులు, ఉపాధి, విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాం. అంతేతప్ప కేసులు మాఫీ చేయించు కోవడానికి కాదు. మమ్మల్ని రక్షించండి అని కేంద్ర ప్రభుత్వం ముందు మా పార్టీ అడ గాల్సిన అవసరం లేదు. ఒక పార్టీకి దగ్గర కావడం కోసం మరో పార్టీని వదులు కోవాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ ఇటీవల టీడీపీ గురించి ఎక్కువగా ఎందుకు ప్రస్తావిస్తు న్నారంటే జగన్ వంటి మహానుభావుడి పాలన వల్ల రాష్ట్ర ప్రజలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మరి ఏం చేస్తాం. అందరం కలిసీ పని చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం. టీడీపీ, జనసేన శాసనసభ ఎన్నికల్లో కలిసే అంశంపై భవిష్యత్తులో మాట్లాడుకుంటాం. దీపావళి తర్వాత కొందరు ముఖ్య నాయ కులు మా పార్టీలో చేరనున్నారు. జగన్ చాలా మంది సలహాదారులను పెట్టుకున్నారు. సీఎం కంటే ముందుగా సలహాదారులే స్పందిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజ నాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే అవి సరికాదన్న విషయాన్ని పవన్ కల్యాణ్ తప్పకుండా నిలదీశారు. గంజాయి సాగు పెరిగింది. యువకులను గంజాయి సాగులోకి లాగుతున్నారు. వైసీపీ నాయకత్వం బాధ్యతగా దీన్ని అరికట్టాలి. ఆ పనిచేయట్లేదు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటును స్తంభింపజేస్తామని వైసీపీ అప్పట్లో తెలి పింది. ఇప్పుడు ఆ పని చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వంతో కనీసం చర్చలూ జరపడం లేదు. కేసుల గురించి వైసీపీ భయపడుతోంద’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos